పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్‌ల బదిలీ

by Disha Web Desk 16 |
పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్‌ల బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్: న్యూ ఇయర్ వేళ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నల్గొండ జిల్లా ఎస్పీగా దీప్తిని బదిలీ చేశారు. సీఐడీ ఉమెన్ ప్రొటక్షన్ ఎస్పీగా అపూర్వరావును బదిలీ చేశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు సోమవారం నుంచే బాధ్యతలు స్వీకరించనున్నారు.

కాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాక కీలక అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలో పలు మార్పులు చేస్తున్నారు. అంతేకాదు వివిధ శాఖల్లో పని చేస్తున్న అధికారులను బదిలీ చేస్తున్నారు. తొలుత కొత్త డీజీపీగా రవి గుప్తాను నియమించారు. ఆ తర్వాత 20 మంది ఐపీఎస్ అధికారులు, 14 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. అనంతరం రవాణా శాఖలో ముగ్గురు జేటీసీలను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా మరో ఇద్దరు ఐపీఎస్‌లను రేవంత్ రెడ్డి సర్కార్ బదిలీ చేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed